వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-07T05:11:14+05:30 IST

రానున్న 15 రోజులు జిల్లాలోని వాడవాడల్లో స్వా తంత్య్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశిం చారు.

వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఎస్పీ

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రానున్న 15 రోజులు జిల్లాలోని వాడవాడల్లో స్వా తంత్య్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జిల్లా అధికారులను ఆదేశిం చారు. శనివారం మధ్యాహ్నం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వాహణ సన్నద్దతలో భాగం గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర శాఖల కార్యదర్శు లతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు, ఎస్పీ కే.మనోహర్‌, అదనపు కలెక్టర్లు మనూచౌదరి, మోతీలాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈనెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రభుత్వం ద్వారా సూచించిన రోజువారీ కార్యక్రమాలను ఏవిధంగా నిర్వహించనున్నారో వివరించారు. 15రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ప్రతీ ఒక్కరు నిబద్దతతో కృషి చేయా లని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T05:11:14+05:30 IST