వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలి
ABN , First Publish Date - 2022-08-13T04:23:40+05:30 IST
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇం టిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
ఏసీసీ, ఆగస్టు 12: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇం టిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అనేక మంది మహోన్నత వ్యక్తుల ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్రం లభించిందని, వారి త్యాగాలను చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. పురుషోత్తం, సిసోడియా, ఆనంద్కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: పట్టణంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్ ఆధ్వర్యం లో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 75 బైకులతో గాంధీ చౌక్ నుంచి శివాలయం, పాత బస్టాండ్, మంగలి బజారు వాడ ల మీదుగా ర్యాలీ కొనసాగింది. బీజేపీ పట్టణాధ్యక్షుడు సుశీల్కుమార్, నాయకు లు వెంకటేశ్వర్, కొండపాక చారి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్, టౌన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బానేష్, శ్రీకాంత్, రాజయ్య, సంజయ్, సంతోష్ , పాల్గొన్నారు.