ఇక వైష్ణోదేవి ఆలయ పూజా ప్రసాదం హోం డెలివరీ

ABN , First Publish Date - 2020-09-22T12:22:54+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ పూజా ప్రసాదం ఇక దేశమంతా హోండెలివరీ చేయనున్నారు....

ఇక వైష్ణోదేవి ఆలయ పూజా ప్రసాదం హోం డెలివరీ

జమ్మూ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ పూజా ప్రసాదం ఇక దేశమంతా హోండెలివరీ చేయనున్నారు. శ్రీమాత వైష్ణోదేవి ఆలయ బోర్డు పూజా ప్రసాదం హోం డెలివరీ సర్వీసును తాజాగా ప్రారంభించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా ఛైర్మన్ గా ఉన్న ఈ ఆలయబోర్డు పూజా ప్రసాదాన్ని దేశవ్యాప్తంగా భక్తులకు హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. జమ్మూలోని  మూడు త్రికూట పర్వతాలపై ఉన్న ఈ వైష్ణోదేవి ఆలయం నుంచి పూజా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకున్న 72 గంటల్లోగా భక్తులకు స్పీడ్ పోస్టు ద్వారా అందించనున్నారు. వైష్ణోదేవి ఆలయ వెబ్ సైట్ ద్వారా పూజా ప్రసాదం కోసం బుకింగ్ చేసుకుంటే వెంటనే పంపిస్తామని ఆలయ అధికార ప్రతినిధి చెప్పారు. 


లెఫ్టినెంట్ గవర్నరు నేతృత్వంలోని ఆలయ కమిటీలో శ్రీ రవిశంకర్, మాజీ డీజీపీ అశోక్ భాన్, జస్టిస్ పెర్మాద్ కోహ్లీ, కేకే శర్మ, మేజర్ జనరల్ శివకుమార్ శర్మలున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైష్ణోదేవి ఆలయంలో యాత్రికుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి రమేష్ కుమార్ చెప్పారు.

Updated Date - 2020-09-22T12:22:54+05:30 IST