వైకుంఠధామాల పనులను పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-10-20T04:34:25+05:30 IST
వైకుంఠధామాల పనులను పూర్తిచేయాలి
ఘట్కేసర్: వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీజంగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని 17వ వార్డులో పరిధిలో గల వైకుంఠధామంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైకుంఠధామాల్లో పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సింగ్రావు, నాయకులు బర్ల దేవేందర్, బర్ల హరిశంకర్, మెడబోయిన నరేష్, లక్ష్మయ్య, శ్రీశైలం, కె.నాగేష్, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.