వాడివేడిగా మామడ మండల సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-05-24T05:47:17+05:30 IST

మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు రాథోడ్‌అమృత అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు సమస్యలు పరిష్కారంకాని సమావేశాలు ఎందుకని, సమయపాలన పాటించని అధి కారుల వైఖరికి నిరసనగా వాకౌట్‌ చేశారు.

వాడివేడిగా మామడ మండల సర్వసభ్య సమావేశం
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ విజయలక్ష్మి

మామడ, మే 23 : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు రాథోడ్‌అమృత అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశాన్ని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు సమస్యలు పరిష్కారంకాని సమావేశాలు ఎందుకని, సమయపాలన పాటించని అధి కారుల వైఖరికి నిరసనగా వాకౌట్‌ చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథి గా హాజరైన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విజయలక్ష్మి రామ్‌కిషన్‌రెడ్డి ఎంపీటీసీలతో చర్చలు జరిపి ఇకముందు సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో సమావేశానికి మళ్లీ హాజరైన ఎంపీటీసీలు ఈ సమా వేశంలో పలు సమస్యలపై అధికారులను ప్రశ్నించి సభ్యులు మొండి గుట్టలో నివాసగృహాల పైనుంచి విద్యుత్‌వైర్‌లను తొల గించాలని, వాస్తపూర్‌ ఎంపీటీసీ చరణ్య పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించడం లేదని, జడ్పీ టీసీ సోనియా పనులు చేయమంటున్నారు కానీ బిల్లులు ఇవ్వటం లేద ని, కొత్తూరు సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి సమా వేశంలో చెప్పిన సమస్యలు పరి ష్కారం కావడం లేదని మామడ ఎంపీటీసీ నవీన్‌ అధికారులను ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా సభ్యులు అందరు కలిసి సమ న్వయంతో మండలాన్ని జిల్లాలోనే నెంబర్‌ వన్‌ మండలంగా తీర్చిదిద్దాలని, అధికారులు సమయపాలన పాటి స్తూ సభ్యులకు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సోని యా సంతోష్‌, వైస్‌ ఎంపీటీసీ లింగారెడ్డి, తహసీల్దార్‌ కిరణ్మయి, ఎంపీ టీసీ మల్లేశం, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:47:17+05:30 IST