వాడవాడలా హనుమాన్ జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-05-26T06:44:31+05:30 IST
అనకాపల్లి జిల్లాలో వాడవాడలా హనుమాన్ జయంతిని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనకాపల్లి, మే 25: అనకాపల్లి జిల్లాలో వాడవాడలా హనుమాన్ జయంతిని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనకాపల్లి అభయాంజనేయస్వామి ఆలయంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పలకా యశోద, పలకా రవి, శారదానగర్లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రముఖ బంగారం వర్తకుడు కొణతాల చిరంజీవి, గవరపాలెం విజ్ఞాన సమితి జంక్షన్లోని ఆలయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, న్యూబర్మాకాలనీలో మళ్ల సురేంద్ర, పోలారపు త్రినాథ్లు స్వామివారిని దర్శించుకుని అన్నసమారాధనను నిర్వహించారు. అనకాపల్లిలోని కొత్తూరు, శారదానగర్, సత్యనారాయణపురం, వెంకుపాలెం, తగరంపూడి తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.