వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-05-12T07:11:43+05:30 IST

కాకర్ల పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో సుమారు 50వేలకు పైగా జనాభా ఉన్నారు.

వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి
మర్రిపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం

కాకర్ల (మర్రిపూడి), మే 11 : కాకర్ల పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలో సుమారు 50వేలకు పైగా జనాభా ఉన్నారు. 21 గ్రామ పంచాయతీల పరిధిలో 13 సచివాలయాలు నడుస్తున్నాయి. అందులో కాకర్ల ఆరోగ్యకేంద్రం పరిధిలోనే 14 గ్రామ పంచాయతీలు, 8 సచివాలయాలు, 30వేల జనాభా ఉంది. మర్రిపూడి ఆరోగ్యకేంద్రం పరిధిలో 7పంచాయతీలు, 5 సచివాలయాలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మర్రిపూడిలో కరోనా వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాకర్లలో మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో మండలంలోని శివారు జంగాలపల్లి, అయ్యపురాజుపాలెం, నర్సరాజుపాలెం. తంగెళ్ల జగ్గరాజుపాలెం గ్రామాల ప్రజలు 40కి.మీ పైగా ప్రయాణించి మర్రిపూడికి రావాల్సి వస్తోంది. దీంతో రద్దీ పెరిగి కరోనా విజృంభించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాకర్లలో వ్యాక్సిన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యాధికారి అశ్వని తెలిపారు.


Updated Date - 2021-05-12T07:11:43+05:30 IST