ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-05-06T05:34:52+05:30 IST

ఎన్టీఆర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉద్యోగులకు బుధవారం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇన్‌చార్జి ఆర్‌ఎం నర్రా శ్రీనివాసరావు నేతృత్వంలో బస్టాండ్‌లోని తిక్కన సమావేశ మందిరంలో ఉద్యోగులకు వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌
వ్యాక్సిన్‌లు వేయించుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు

గుంటూరు, మే 5: ఎన్టీఆర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉద్యోగులకు బుధవారం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఇన్‌చార్జి ఆర్‌ఎం నర్రా శ్రీనివాసరావు నేతృత్వంలో బస్టాండ్‌లోని తిక్కన సమావేశ మందిరంలో ఉద్యోగులకు వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 400 మంది ఉద్యోగులకు తొలిరోజు వ్యాక్సిన్‌లు వేసినట్లు తెలిపారు. గురువారం కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని ఏటీఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇన్‌చార్జి ఆర్‌ఎం మాట్లాడుతూ ఉద్యోగులు కొవిడ్‌-19 నిబందనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. 

  

Updated Date - 2021-05-06T05:34:52+05:30 IST