ఆర్టీసీ ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ అందించాలి: ఎన్ఎంయూ
ABN , First Publish Date - 2021-05-19T09:50:27+05:30 IST
ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ మొదటి, రెండో డోస్ పూర్తి చేయించి, కరోనా మరణాలను నివారించటానికి తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కోరారు.
విజయవాడ (బస్స్టేషన్), మే 18: ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ మొదటి, రెండో డోస్ పూర్తి చేయించి, కరోనా మరణాలను నివారించటానికి తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కోరారు. సుమారు 9 వేల మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారని, వారిలో 240 మంది చనిపోయారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షలు ఇవ్వాలని, కారుణ్య నియామకాల ద్వారా కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం.. వారి కుటుంబ సభ్యులకు చెల్లించవలసిన గ్రాడ్యుటీ, టెర్మినల్ ఎన్-క్యా్షమెంట్, ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా బారినపడిన ఉద్యోగులకు 30 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.