కరోనాకు టీకాయే రక్ష

ABN , First Publish Date - 2021-05-18T05:19:23+05:30 IST

కరోనాకు టీకాయే రక్ష అని రైల్వేకోడూరు తహసీల్దార్‌ జే. శిరీషా తెలిపారు.

కరోనాకు టీకాయే రక్ష

రైల్వేకోడూరు, మే 17: కరోనాకు టీకాయే రక్ష అని రైల్వేకోడూరు తహసీల్దార్‌ జే. శిరీషా తెలిపారు. సోమవారం రైల్వేకోడూరు పట్టణంలోని హెచ్‌ఎంఎం హైస్కూలులో ప్రజలకు కరోనా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైర్‌సను తట్టుకోవాలంటే టీకాలు ప్రతి ఒక్కరు వేయించుకోవాలన్నారు. ప్రజలు కరోనాను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, పరిశుభ్రంగా ఉండాలని, శానిటైజర్లు ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఆర్‌ఐ పగడాల ఫణిక్రిష్ణ  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:19:23+05:30 IST