వ్యాక్సినేషన్‌ లేదా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి: టీటీడీ

ABN , First Publish Date - 2022-01-25T07:15:37+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌,

వ్యాక్సినేషన్‌ లేదా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి: టీటీడీ

తిరుమల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌, లేదా దర్శనానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. గతంలోనే టీటీడీ ఈ నిబంధనల గురించి ప్రకటనలు చేసినప్పటికీ కొంతమంది భక్తులు ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా అలిపిరి చెక్‌పాయింట్‌కు వస్తున్నారు. దీంతో సిబ్బంది అలాంటి వారిని వెనక్కి పంపుతున్నారు. ఒవైుక్రాన్‌ అతివేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌,లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. 


Updated Date - 2022-01-25T07:15:37+05:30 IST