జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-11-11T22:14:20+05:30 IST

వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హ‌రీష్‌రావు స‌మీక్ష నిర్వహించారు. జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేశామని తెలిపారు.

జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్: హరీష్‌రావు

హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హ‌రీష్‌రావు స‌మీక్ష నిర్వహించారు. జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేశామని తెలిపారు. వ్యాక్సినేష‌న్‌ను మ‌రింత వేగవంతం చేయాలని హ‌రీష్‌రావు ఆదేశించారు. టిమ్స్ ఆస్పత్రి పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తామన్నారు. వ్యాక్సినేష‌న్ కార్యక్రమంపై శ‌నివారం అన్ని జిల్లాల క‌లెక్టర్లు, డీఎంహెచ్‌వోల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని హరీష్‌రావు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగారు. బుధవారం బీఆర్కే భవన్‌లో ఆయన వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖ పని తీరుపై స్వల్పకాల సమీక్ష చేశారు. 

Updated Date - 2021-11-11T22:14:20+05:30 IST