వారికి వ్యాక్సినేషన్ సాధ్యం కాదు... తేల్చిచెప్పిన జగన్
ABN , First Publish Date - 2021-05-01T00:14:17+05:30 IST
18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ సాధ్యం కాదని సీఎం జగన్ తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తి సామర్థ్యం అంచనా వేయకుండానే
అమరావతి: 18-45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ సాధ్యం కాదని సీఎం జగన్ తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తి సామర్థ్యం అంచనా వేయకుండానే ప్రకటన చేయడం పలు విమర్శలు వస్తున్నాయి. మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ అంటూ ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. 2 కోట్ల మందికిపైగా ఆ వయసు వారు ఉంటారని అంచనా వేస్తున్నారు. మే 1 నుండి ఈ కేటగిరిలో వాక్సినేషన్ ఉండదని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్కుమార్ సింఘాల్ ప్రకటించారు. శనివారం వాక్సినేషన్పై ప్రధాని మోదీకి లేఖ సీఎం జగన్ రాయనున్నారు.