దేశంలో 163.58 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-26T20:48:08+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.

దేశంలో 163.58 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఈ మేరకు బుధవారం నాటికి దేశంలో 163.58 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 59లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 93.23 శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 2,85,914 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 22,23,018 కాగా పాజిటివిటీ రేట్ 17.33 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-26T20:48:08+05:30 IST