సింహాచల ఆలయ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-06T05:23:10+05:30 IST
కరోనా బారినపడిన సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ పూసపాటి సంచయిత గజపతి పేర్కొన్నారు.
తొలిరోజు 163 మందికి వాక్సిన్
సింహాచలం, మే 5: కరోనా బారినపడిన సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు సింహాచల వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ పూసపాటి సంచయిత గజపతి పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ పర్యవేక్షణలో బుధవారం సింహగిరిపై దేవస్థానం సిబ్బందికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా సంచయిత వ్యాక్సిన్ వేయించుకోగా, ఆ తర్వాత పలువురు ఏఈవోలు, పర్యవేక్షణాధికారులు, వైదిక, లౌకిక సిబ్బందికి కలిపి 163 మందికి వ్యాక్సిన్ వేశారు. సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.