వ్యాక్సిన్‌ వేసుకున్న విరాట్‌, పుజార, ఇషాంత్‌

ABN , First Publish Date - 2021-05-11T09:23:41+05:30 IST

ఇంగ్లండ్‌ పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియా క్రికెటర్లు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే ధవన్‌, రహానె తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకోగా..

వ్యాక్సిన్‌ వేసుకున్న విరాట్‌, పుజార, ఇషాంత్‌

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ పర్యటనకు సిద్ధమవుతున్న టీమిండియా క్రికెటర్లు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే  ధవన్‌, రహానె తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకోగా.. తాజాగా జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పుజార, పేసర్‌ ఇషాంత్‌ శర్మ టీకా వేయించుకున్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన కోహ్లీ.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించాడు. భార్య, బాస్కెట్‌బాల్‌ మాజీ ప్లేయర్‌ ప్రతిమతో కలిసి ఇషాంత్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు.


వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఫొటోను పుజార దంపతులు పోస్ట్‌ చేశారు. వచ్చేనెల న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం భారత జట్టు త్వరలోనే ఇంగ్లండ్‌ వెళ్లనుంది. ఈలోపు క్రికెటర్లంతా తొలి డోసు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని బీసీసీఐ సూచించిన సంగతి తెలిసిందే. క్రికెటర్లకు రెండో డోసు టీకాను ఇంగ్లండ్‌లోనే ఇవ్వనున్నారు. 


ఇషాంత్‌ దంపతులు

Updated Date - 2021-05-11T09:23:41+05:30 IST