బ్యాంకుల్లోనే వ్యాక్సిన్ వేయండి
ABN , First Publish Date - 2021-05-09T08:51:35+05:30 IST
బ్యాంకుల్లో వందల మంది ఉద్యోగులు కొవిడ్తో చనిపోతున్నారని,దీనిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల యునైటెడ్ ఫోరం ఎస్ఎల్బీసీకి విజ్ఞప్తి చేసింది
ఎస్ఎల్బీసీకి బ్యాంకు యూనియన్ల మొర
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో వందల మంది ఉద్యోగులు కొవిడ్తో చనిపోతున్నారని,దీనిని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల యునైటెడ్ ఫోరం ఎస్ఎల్బీసీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి. బ్రహ్మానందరెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఒక్క ఎస్బీఐకి చెందిన ఉద్యోగులే 48 మంది మరణించారని, మిగిలిన బ్యాంకు ఉద్యోగుల మరణాలు వందల్లో ఉన్నాయని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలిపింది.