విద్యాసంస్థలకు 14 వరకు సెలవులు పొడిగింపు
ABN , First Publish Date - 2020-03-31T12:20:01+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 19 నుంచి 31వ తేదీవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన
చిత్తూరు సెంట్రల్, మార్చి 30: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈనెల 19 నుంచి 31వ తేదీవరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఏప్రిల్ 14వ తేదీవరకు లాక్డౌన్ ఉండటంతో విద్యాసంస్థలకు సైతం అప్పటి వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.