బడుగుల కోసమే రాజ్యాంగం: వీహెచ్
ABN , First Publish Date - 2022-02-06T00:49:54+05:30 IST
బడుగుల కోసం ఆలోచన చేసే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని కాంగ్రెస్
సిద్దిపేట: బడుగుల కోసం ఆలోచన చేసే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు, దాసోజు శ్రావణ్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ ఎందుకు మాట్లాడారో అర్థంకావడం లేదన్నారు. వ్యవసాయ చట్టాల అమలుకు సపోర్ట్ చేసి ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. దళిత సీఎం, మూడెకరాల భూమి అని చెప్పి దళితులను కేసీఆర్ మోసం చేశారని వీహెచ్, శ్రావణ్ ఆరోపించారు.