‘ఎమ్మెల్యే బొల్లా అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి’

ABN , First Publish Date - 2021-10-29T21:32:58+05:30 IST

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చాడని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు చెప్పారు.

‘ఎమ్మెల్యే బొల్లా అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి’

గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చాడని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు చెప్పారు. జగన్ ఇచ్చిన లైసెన్సుతో బొల్లా దోపిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా ఇళ్ల స్దలాల పేరుతో కోట్లు దోచుకున్నాడన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలకు ఎకరాకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దళితులను సైతం  వదలకుండా ఎమ్మెల్యే వసూలుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములకు పట్టాలు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు పాసు పుస్తకాలతో బ్యాంక్ లోన్‌లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-29T21:32:58+05:30 IST