‘సీఎం కేసీఆర్కు తాగుబోతు రత్న అవార్డు ఇవ్వాలి’
ABN , First Publish Date - 2022-01-04T18:10:25+05:30 IST
సీఎం కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వం తాగుబోతు రత్నా అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఉజ్మా షకీర్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను మద్యానికి బానిసలుగా చేసిన సీఎం కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వం తాగుబోతు రత్నా అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఉజ్మా షకీర్ అన్నారు. నాంపల్లిలోని గన్పార్క్ వద్ద ఏఐసీసీ, టీపీసీసీ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి ఆమె మద్యంతో అభిషేకం చేశారు. అలాగే మందు సీసాల దండను వేసి నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలో మద్యం బానిసలు పెరిగిపోయారని, నేరాలు అధికమవుతున్నాయని ఉజ్మా షకీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.