రద్దీ ప్రాంతంలో.. అందరూ చూస్తుండగా.. ఓ అమ్మాయి, అబ్బాయి సడన్గా చేసిన పనికి అందరూ షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-10-29T17:05:50+05:30 IST
అదీ అత్యంత రద్దీ ప్రాంతం..
ఇంటర్నెట్డెస్క్: అదీ అత్యంత రద్దీ ప్రాంతం. ఆ ప్రాంతానికి ఓ అమ్మాయి, అబ్బాయి వచ్చారు. కాసేపు ఏం ఆలోచించారో ఏమో.. ఉన్నట్టుండి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ సంఘటన చూసి అక్కడున్నవారందరూ షాక్కు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
అత్యంత రద్దీ ప్రాంతాలలో ఆగ్రా ఒకటన్న విషయం తెలసిందే. ఆ పట్టణానికి ఓ అమ్మాయి, అబ్బాయి వచ్చారు. స్థానిక ప్రాంతంలో ఉన్న ఓ బ్రిడ్జి వద్దకు వారిద్దరు చేరుకున్నారు. బ్రిడ్జి మీదకు అనేక వాహనాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి. అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి, అబ్బాయి కాసేపు ఆ వాహనాలను చూస్తూ ఉన్నారు. కాసేపటికే వారు అనుకున్నది చేసేశారు. ఉన్నట్టుండి ఆ బ్రిడ్జి కింద ప్రవహించే యమునా నదిలోకి దూకేశారు. వారిద్దరూ చేతులు పట్టుకుని, బ్రిడ్జి మీదకు ఎక్కడం చూసి కొంతమంది వాహనదారులు గట్టిగా కేకులు వేస్తూ.. వారిని ఆపడానికి ప్రయత్నించబోయారు. కానీ వారొచ్చేలోపే ఘోరం జరిగిపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. పోలీసులు కొంతమంది గజఈతగాళ్లను తీసుకొచ్చి వారి కోసం నదిలో గాలించారు. కానీ వారి జాడ తెలియలేదు.
స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ నదిలో తూకిన వారిద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. సంఘటనా స్థలంలో ఒక బ్యాగు దొరికిందని, అందులో వారికి సంబంధించిన దుస్తులు, పాస్పోర్టు, ఒక పేపర్ లభించిందన్నారు. ఆ పేపర్ మీద ఓంకార్ పుత్ర జగదీష్, ఎస్-26 ఇందిర కల్యాణ్ క్యాంప్, బదార్పూర్, న్యూఢిల్లీ అని రాసి ఉందని చెప్పారు. అంతేకాకుండా ఆ బ్యాగులో అమ్మాయి, అబ్బాయి ఉండే ఒక ఫొటో లభించిందని, కానీ వారి ముఖాలు సరిగ్గా కనిపించడం లేదన్నారు. పేపర్ మీద ఉన్న అడ్రస్ ఆధారంగా వారేవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.