ఉత్తరాఖండ్‌లో కరోనా ఉధృతి.. ఒకేరోజు 9,642 మందికి పాజిటివ్..

ABN , First Publish Date - 2021-05-08T02:42:24+05:30 IST

ఉత్తరాఖండ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఇక్కడ రికార్డు స్థాయిలో 9,642 కొవిడ్-19 పాజిటివ్...

ఉత్తరాఖండ్‌లో కరోనా ఉధృతి.. ఒకేరోజు 9,642 మందికి పాజిటివ్..

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఇక్కడ రికార్డు స్థాయిలో 9,642  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి అని ఆరోగ్య శాఖ తన బులిటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 2,29,993కి పెరిగింది. మరోవైపు ఈ మహమ్మారి కారణంగా గడచిన 24 గంటల్లో 137 మంది మృత్యువాత పడినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఉత్తరాఖండ్‌లో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 3,430కి పెరిగింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇది వరుసగా నాలుగోరోజు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 67,691 వరకు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-05-08T02:42:24+05:30 IST