బీజేపీలోకి ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
ABN , First Publish Date - 2022-01-17T22:41:00+05:30 IST
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మహిళా..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరితా ఆర్య సోమవారంనాడు బీజేపీలో చేరారు. నైనిటాల్ మాజీ ఎమ్మెల్యే అయిన సరితా ఆర్య డెహ్రాడూన్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తీర్ధం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్, ఇతర నేతలు ఈ సందర్భంగా హాజరయ్యారు.
నైనిటాల్ నియోజవర్గం నుంచి టిక్కెట్ను సరితా ఆర్య ఆశిస్తున్నారు. అయితే అక్కడి నుంచి కాంగ్రెస్ టిక్కెట్ దొరికే అవకాశాలు లేకపోవడం కూడా సరిత ఆర్య పార్టీ మారడానికి కారణం కావచ్చని చెబుతున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజీవ్ ఆర్య చేతిలో ఆమె ఓడిపోయరు. సంజయ్ ఆర్య ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు.