కరోనా కర్ఫ్యూ పొడిగించిన మరో రాష్ట్రం

ABN , First Publish Date - 2021-07-13T07:59:57+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో మరో రాష్ట్రం ఆంక్షలను పొడిగించింది. జూలై 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు..

కరోనా కర్ఫ్యూ పొడిగించిన మరో రాష్ట్రం

డెహ్రాడూన్: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నేపథ్యంలో మరో రాష్ట్రం ఆంక్షలను పొడిగించింది. జూలై 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని, అందువల్ల కర్ఫ్యూను పొడిగిస్తున్నామని ఉత్తరాఖండ్ రాష్ట్రం పేర్కొంది. జూలై 20 ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఉన్న సడలింపులకు తోడు మరికొన్ని సడలింపులను కూడా అమలు చేయనున్నట్లు తెలిపింది. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు ప్రజలు హాజరు కావడంపై సడలింపులు ఇచ్చింది. ప్రభుత్వం నివేదిక ప్రకారం.. 50 మందికి మించకుండా పెళ్లిళ్లకు హాజరు కావచ్చు. అలాగే 50 మందికి మించకుండా అంత్యక్రియలు కార్యక్రమాలకు కూడా హాజరుకావచ్చు.

Updated Date - 2021-07-13T07:59:57+05:30 IST