మా ముఖ్యమంత్రికి కరోనా నెగెటివ్ : ప్రకటించిన అధికారులు

ABN , First Publish Date - 2020-06-05T20:43:05+05:30 IST

అయితే ఈ సమావేశానికి టూరిజం మంత్రి సత్పాల్ మహారాజ్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాతే ఆయనకు కరోనా అని తేలింది. దీంతో సీఎంతో

మా ముఖ్యమంత్రికి కరోనా నెగెటివ్ : ప్రకటించిన అధికారులు

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా సోకలేదని అధికారులు శుక్రవారం ప్రకటించారు. టూరిజం మంత్రితో ఆయన సమావేశం నిర్వహించారు. అయితే ఆ మంత్రికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ముఖ్యమంత్రి రావత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే ముఖ్యమంత్రికి పరీక్షలు నిర్వహించామని, ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నిర్వహించారు.


అయితే ఈ సమావేశానికి టూరిజం మంత్రి సత్పాల్ మహారాజ్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాతే ఆయనకు కరోనా అని తేలింది. దీంతో సీఎంతో పాటు మరో ముగ్గురు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే సీఎం రావత్ ఇప్పటికీ స్వీయ నిర్బంధంలోనే ఉన్నారని, మరో ముగ్గురు మంత్రులు మాత్రం స్వీయ నిర్బంధం నుంచి బయటికి వచ్చి తమ విధులకు హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-05T20:43:05+05:30 IST