కరోనా వల్ల ఒక్కరోజే ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ABN , First Publish Date - 2020-09-21T13:14:57+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్‌, ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ఇందిరా హృదయేష్ లకు కరోనా సోకడంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం ఒకరోజు మాత్రమే నిర్వహించాలని ....

కరోనా వల్ల ఒక్కరోజే ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్):  ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రేమ్ చంద్ అగర్వాల్‌, ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ఇందిరా హృదయేష్ లకు కరోనా సోకడంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కేవలం ఒకరోజు మాత్రమే నిర్వహించాలని అన్నిపార్టీ బిజినెస్ కన్సల్ టేషన్ మీటింగులో నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశం ఈ నెల 23వతేదీన ఒకరోజు మాత్రమే నిర్వహిస్తామని ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి మదన్ కౌశిక్ ప్రకటించారు. ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల గంట ఉండదని మంత్రి చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు ప్రేమ్ చంద్ అగర్వాల్ కు కరోనా పాజిటివ్ సోకిన నేపథ్యంలో విధానసభ డిప్యూటీ స్పీకర్ రఘునాథ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తారని మంత్రి మదన్ కౌశిక్ వివరించారు.

Updated Date - 2020-09-21T13:14:57+05:30 IST