కరోనా రిపోర్ట్: ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500పైగా కేసులు

ABN , First Publish Date - 2020-06-06T01:12:54+05:30 IST

వలస కార్మికులను వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించినప్పటినుంచి పలు రాష్ట్రాల్లో కరోనా...

కరోనా రిపోర్ట్: ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500పైగా కేసులు

లక్నో: వలస కార్మికులను వారి వారి సొంత రాష్ట్రాలకు తరలించడం ప్రారంభించినప్పటినుంచి పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 500కు పైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 502 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 12 మంది మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,733కు చేరింది. 257 మంది మరణించారు ఇప్పటివరకు 5,648 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 3,828 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-06-06T01:12:54+05:30 IST