యూపీ ఎన్నికల వేళ యోగి కీలక ప్రకటన
ABN , First Publish Date - 2022-02-23T19:16:11+05:30 IST
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. సంరక్షణ కరవైన గోవులను పెంచే రైతులకు వెయ్యి రూపాయల సాయమందిస్తామన్నారు. రాష్ట్రంలో గో హత్యలు జరగనీయబోమని అమేథీలో జరిగిన ఎన్నికల సభలో స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలు తెరవనిచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంటపొలాలు దెబ్బతీయకుండా చూస్తామన్నారు.
మరోవైపు బహ్రెయిచ్ ఎన్నికల సభలో ప్రసంగించిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గోవులు రైతుల పంటపొలాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. గో రక్షణ కోసం కేటాయించిన నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించారు.