షాకింగ్ ఘటన: భర్తలో లైంగిక సామర్థ్యం తగ్గిపోయిందని నాలుగేళ్ల నుంచి గొడవ.. చివరికి భార్య సలసల మరుగుతున్న నూనె తీసుకుని..

ABN , First Publish Date - 2021-10-20T18:03:31+05:30 IST

భర్తలో లైంగిక సామర్థ్యం తగ్గిపోయిం..

షాకింగ్ ఘటన: భర్తలో లైంగిక సామర్థ్యం తగ్గిపోయిందని నాలుగేళ్ల నుంచి గొడవ.. చివరికి భార్య సలసల మరుగుతున్న నూనె తీసుకుని..

ఇంటర్‌నెట్‌డెస్క్: మధుమేహం బారిన పడటంతో భర్తలో లైంగిక సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో భార్య ప్రతిరోజూ భర్తతో గొడవపడేది. ఎందుకు పనికి రాకుండాపోయాడని తిడుతూ ఉండేది. ఈ గొడవలు తీవ్రతరం కావడంతో భర్త మానసికంగా బాధపడుతూ ఉండేవాడు. కానీ మంగళవారం రాత్రి జరిగిన సంఘటనకు అతని గుండె బద్దలైనంత పనైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాలోని నగర్ కొత్వాలి పట్టణం సత్యప్రేమి నగర్‌కు చెందిన కౌశల్ కిషోర్ అనే 65 ఏళ్ల వ్యక్తి నాలుగేళ్ల క్రితం మధుమేహం బారిన పడ్డాడు. అప్పటినుంచి ఆయనలో లైంగిక శక్తి తగ్గుతూ వచ్చింది. దీంతో భార్యకు దూరంగా ఉంటున్నాడు. భర్తలో వచ్చిన మార్పు కారణంగా భార్య ప్రతిరోజూ గొడవపడేది. సరిగ్గా అన్నం కూడా వండి పెట్టేది కాదు. ఆయననే వంట చేసుకుని తినేవాడు. కానీ మంగళవారం రాత్రి భార్య చేసిన పనికి కిషోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.



రాత్రి భోజనం చేసే సమయంలో భార్య సలసల మరుగుతున్న నూనెను తీసుకువచ్చి భర్తపై పోసింది. ఈ ఘటనతో ఆయన షాక్‌కు గురయ్యాడు. తల నుంచి కాలి వరకు వేడి నూనె పడడంతో వళ్లంతా కాలిపోయింది. ఆయన అరుపులు విని పక్కింటివాళ్లు పరుగెత్తుకొని వచ్చారు. కిషోర్ వళ్లంతా కాలిపోవడం చూసి చలించిపోయారు. కానీ భార్యలో ఎటువంటి చలనం లేదు. భర్తపై కోపం ఆమెకు ఏమాత్రం తగ్గలేదు. పొరుగింటివాళ్లందరూ కలిసి కిషోర్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 


కిషోర్ మీడియాతో మాట్లాడుతూ తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారంతా పనుల నిమిత్తం వేరే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారన్నాడు. మధుమేహం కారణంగా తనలో లైగింక సామర్థ్యం తగ్గిపోయిందన్నాడు. పరిస్థితి అర్థం చేసుకోకుండా.. తన భార్య గొడవపడేదని, కొన్నిసార్లు కర్రలు, చెప్పులతో కూడా దాడి చేసిందని చెప్పాడు.  



Updated Date - 2021-10-20T18:03:31+05:30 IST