సీఎం కేసీఆర్కు ఉత్తమ్ బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2020-04-05T02:44:34+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు బేషరతుగా సమ్మె విరమించారని.. ఉపాధి పనులు సక్రమంగా జరగాలంటే వారిని విధుల్లో చేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 28న ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్తో లక్ష్యాలు సాధించని వారి కాంట్రాక్ట్ రెన్యువల్ చేయరనే ఆందోళనతో సమ్మెకు దిగారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెంటనే వారిని విధుల్లో చేర్చుకొని ఉపాధి పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ను ఉత్తమ్ కోరారు.