ఏడు నెలల్లో అధికారంలోకి వస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-06-09T02:36:29+05:30 IST

రానున్న ఏడెనిమిది నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఏడు నెలల్లో అధికారంలోకి వస్తాం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నల్లగొండ: రానున్న ఏడెనిమిది నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటలు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు శాపంగా మారిందని, కాంట్రాక్టర్ల నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంటోందని ఆరోపించారు. దేశంలో పంటల బీమా లేని రాష్ట్ర ఒక్క తెలంగాణ అన్నారు. కేసీఆర్‌ మాయమాటలకు ప్రజలు మోసపోయారన్నారు. దళితులకు మూడు ఎకరాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాలేదని, మద్యం మాత్రం రెట్టింపు ధర పెంచిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. 

Updated Date - 2022-06-09T02:36:29+05:30 IST