యాసంగిలో వరి సాగు చేయండి: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-12-28T01:24:29+05:30 IST
ఈ యాసంగిలో వరి సాగు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఈ యాసంగిలో వరి సాగు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. గత యాసంగిలో సుమారు 52 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు వీరంతా ఎటు పోవాలని ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులు ఈ యాసంగిలో నిర్భయంగా వరి సాగు చేయాలని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీల వైఖరి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రైతుల గోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరితాడు అవుతుందని ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు.