కరోనా టెస్ట్‌లు ఆలస్యంగా జరుగుతున్నాయి: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-04-06T00:05:49+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్ట్‌లు ఆలస్యంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.

కరోనా టెస్ట్‌లు ఆలస్యంగా జరుగుతున్నాయి: ఉత్తమ్‌

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్ట్‌లు ఆలస్యంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణీ వేగవంతం చేయాలని ఉత్తమ్‌ సూచించారు. కరోనా నియంత్రణ, పేదలను ఆదుకునేందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తికి మతం రంగు పులమడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వలస కార్మికులు, కూలీలను ఆదుకునేందుకు గాంధీభవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రాల్లో డీసీసీలు కూడా కంట్రోల్‌ రూమ్‌లు, కరోనా రిలీఫ్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశామని ఉత్తమ్‌ చెప్పారు.

Updated Date - 2020-04-06T00:05:49+05:30 IST