నల్గొండపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-06-03T01:47:18+05:30 IST

నల్గొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు

నల్గొండపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు: ఉత్తమ్

నల్గొండ: నల్గొండ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసుల అండతో ప్రాజెక్టుల సందర్శనను కేసీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ఐపీఎస్‌ అధికారులు కేసీఆర్‌కు తొత్తుగా మారారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్‌ 10 వేల మందితో ప్రాజెక్టుల వద్దకు వెళ్లారన్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఒకరిద్దరు వెళ్తుంటే లాక్‌డౌన్‌ వంకతో అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు ఎందుకు ఆగిపోయాయి?, రోజుకు 3.25 టీఎంసీలు వచ్చే ఎస్‌ఎల్‌బీసీకి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారని విమర్శించారు. ఈనెల 4న మంజీరా, 6న గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-06-03T01:47:18+05:30 IST