వారం రోజుల లాక్‌డౌన్‌కే వేతనాల్లో కోత?: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-04-01T20:00:31+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని..

వారం రోజుల లాక్‌డౌన్‌కే వేతనాల్లో కోత?: ఉత్తమ్‌

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల లాక్‌డౌన్‌కే ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కోతలు విధించడం సరికాదన్నారు. వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2020-04-01T20:00:31+05:30 IST