బండి సంజయ్‌కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా తెలియదు: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-11-25T17:58:32+05:30 IST

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు అడుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

బండి సంజయ్‌కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా తెలియదు: ఉత్తమ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు అడుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కి సీఎం కేసీఆర్ మద్దతు పలికారా.. లేదా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కు రాజకీయ అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కరీంనగర్‌లో చిల్లర కార్పొరేటర్‌గా గెలిచిన ఆయన ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. బండి సంజయ్‌కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా సరిగా తెలియదన్నారు. అలాంటి వ్యక్తికి ప్రెసిడెంట్ ఇస్తే ఇలాగే ఉంటుందని ఉత్తమ్ విమర్శించారు.




Updated Date - 2020-11-25T17:58:32+05:30 IST