ఉత్సవం ముగిసి.. ఉత్సాహంగా ఊరికి..
ABN , First Publish Date - 2022-05-19T06:40:32+05:30 IST
మోదకొండమ్మ ఉత్సవం ముగియడంతో భక్తులు బుధవారం స్వస్థలాలకు తిరుగుప్రయాణమయ్యారు.
ప్రయాణికులతో పాడేరు బస్ కాంప్లెక్స్ కిటకిట
మోదకొండమ్మ ఉత్సవం ముగియడంతో భక్తులు బుధవారం స్వస్థలాలకు తిరుగుప్రయాణమయ్యారు. ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా వారం రోజుల క్రితమే ఇక్కడి బంధువుల ఇళ్లకు వచ్చారు. పండగ ముగియడంతో వివిధ ప్రాంతాలకు బయలుదేరిన వారు బస్సులు, జీపులను ఆశ్రయించారు. అలాగే కొందరు సొంత వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో పాడేరు పట్టణంలో సందడి కనిపించింది.
- ఆంధ్రజ్యోతి, పాడేరు