ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-05-22T05:39:14+05:30 IST

నారాపురం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగులో శనివారం ఉదయం 7 గంటలకు బండలాగుడు పోటీలు ప్రారంభించారు.

ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు
బండలాగుతున్న ఎద్దులు

జమ్మలమడుగు రూరల్‌, మే 21: నారాపురం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగులో శనివారం ఉదయం 7 గంటలకు బండలాగుడు పోటీలు ప్రారంభించారు. సాయంత్రం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మొదటిస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం నాగర్‌కర్నూలుకు చెందిన ఎడ్ల యజమానులు వైపీఆర్‌ బ్రదర్స్‌ వి.ప్రసన్నరెడ్డికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేల్పుల శివమ్మ  రూ.60 వేలు అందజేశారు. రెండవ బహుమతిగా రూ. 50 వేలను ప్రొద్దుటూరు మండలం కల్లూరుకు చెందిన పెరుమాళ్ల శివకృష్ణయాదవ్‌కు కుడుముల ఈశ్వర్‌రెడ్డి కంపెనీ బృందం అందజేసింది. బనగానపల్లెకు చెందిన బీరం రమాదేవికి మూడవ బహుమతి రూ.40 వేలను చామకూరి విష్ణువర్ధన్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి అందజేశారు.

Updated Date - 2022-05-22T05:39:14+05:30 IST