పీఆర్సీని పునఃపరిశీలించాలి

ABN , First Publish Date - 2022-01-15T07:27:04+05:30 IST

పీఆర్సీని పునఃపరిశీలించాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండు చేశారు.

పీఆర్సీని పునఃపరిశీలించాలి
పీఆర్సీకి వ్యతిరేక ఉత్తర్వులు దగ్ధం చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

చిత్తూరు, జనవరి 14(ఆంధ్రజ్యోతి): పీఆర్సీని పునఃపరిశీలించాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండు చేశారు. ఆ ఉత్తర్వుల ప్రతులను శుక్రవారం జిల్లావ్యాప్తంగా భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. చిత్తూరులోని యూటీఎఫ్‌ కార్యాలయం ఎదుట జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలో రాష్ట్ర కౌన్సిలర్‌ నిర్మల, జిల్లా కార్యదర్శులు బండి మధుసూదన్‌రెడ్డి, పద్మజ.. పుత్తూరులో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్‌ఎస్‌ నాయుడు.. శ్రీకాళహస్తిలో జిల్లా సహాధ్యక్షుడు సూర్యప్రకాష్‌, పలమనేరులో జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, రాష్ట్ర కౌన్సిలర్‌ ప్రకాష్‌ నాయుడు.. మదనపల్లెలో పురం వెంకటరమణ, రవి ప్రకాష్‌, రమణ, హేమలత.. పీలేరులో సదాశివారెడ్డి తదితరులు భోగి మంటల్లో ఉత్తర్వుల ప్రతులు వేసి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. పీఆర్సీకి సంబంధించి ఉపాధ్యాయుల ఆందోళనకు సీఐటీయూ మద్దతిస్తుందని కందారపు మురళి ప్రకటించారు. 

Updated Date - 2022-01-15T07:27:04+05:30 IST