ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-06T04:54:59+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటప్ప

  • టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటప్ప

తలకొండపల్లి :  ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటప్ప కోరారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్‌లో శనివారం టీఎ్‌సయూటీఎఫ్‌ మండల మహాసభ నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వెంకటప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు రాములయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, చెన్నయ్య, రమేష్‌, ఆంజనేయులు, సురేష్‌ పాల్గొన్నారు. కాగా, యూటీఎఫ్‌ మండల సంఘానికి నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురేష్‌, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు,. కోశాధికారిగా విష్ణుమూర్తి, ఉపాధ్యక్షులుగా శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మి, బాలు ఎంపికయ్యారు. 

Updated Date - 2020-12-06T04:54:59+05:30 IST