ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్సీ ఐవీ
ABN , First Publish Date - 2020-08-11T10:56:55+05:30 IST
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాన్ని ప్రగతిబాటలో నడిపేందుకు ప్రతిన బూనాలని ఉభయ గోదావ..
యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
అమలాపురం టౌన్, ఆగస్టు 10: ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాన్ని ప్రగతిబాటలో నడిపేందుకు ప్రతిన బూనాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు పిలుపుని చ్చారు. యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో పలుచోట్ల నిర్వహించారు. అమలాపురం యూటీఎఫ్ హోంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ పీఎస్ శిరోమణి, ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటీఎఫ్ చారిత్రక అవసరంగా ఆవిర్భవించి ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ద్వారా విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేసిందని వివరించారు.