‘బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించుకోవాలి’

ABN , First Publish Date - 2022-09-23T05:53:10+05:30 IST

ప్రతి ఒక్కరూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించు కోవాలని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ అన్నారు.

‘బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించుకోవాలి’

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 22: ప్రతి ఒక్కరూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించు కోవాలని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ అన్నారు. ప్రకాష్‌నగర్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో గురువారం టెలిఫోన్‌ అడ్‌ వైజరీ కమిటీ సమావేశం సంస్థ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో సిగ్నల్స్‌ ప్రాబ్లమ్‌గా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి మర మ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ప్యాలకుర్తి రమేష్‌, ఆమడగుంట్ల కృష్ణారెడ్డి, అజయ్‌ కుమార్‌, రోషన్‌ అలీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T05:53:10+05:30 IST