ట్రంప్ వేసిన అన్ని కేసులను కొట్టేసిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-03-09T12:02:06+05:30 IST

అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ వేసిన అన్ని కేసులను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

ట్రంప్ వేసిన అన్ని కేసులను కొట్టేసిన సుప్రీంకోర్టు

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ వేసిన అన్ని కేసులను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చివరగా మిగిలిన మూడు కేసులను సైతం తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. విస్కాన్సిన్‌, పెన్సిల్‌వేనియాలలో పోలైన వేలాది ఆబ్సెంటీ బ్యాలెట్లపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ జో బైడెన్ ట్రంప్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ కింది కోర్టులలో పిటిషన్లు వేశారు. కింది కోర్టులు ఈ పిటిషన్లను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక్క విస్కాన్సిన్, పెన్సిల్‌వేనియాలలో మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఇదే విధంగా మోసం జరిగిందంటూ ట్రంప్ కోర్టులకెక్కారు. అయితే ఏ ఒక్క కోర్టులో కూడా ట్రంప్‌కు ఊరట లభించలేదు. ప్రతి ఒక్క కేసును కూడా కోర్టులు కొట్టివేస్తూనే వచ్చాయి. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పటికి ఆయన ఇప్పటి వరకు జో బైడెన్ గెలుపును ధ్రువీకరించకపోవడం విశేషం.

Updated Date - 2021-03-09T12:02:06+05:30 IST