మేము భార‌త్‌కే అండగా ఉంటాం: అమెరికా

ABN , First Publish Date - 2020-07-07T13:41:57+05:30 IST

భారత్‌-చైనా సంక్షోభం విషయంలో భారత్‌కు అండగా అమెరికన్‌ మిలిటరీ కొనసాగుతుందని వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మిడోవ్స్‌ పేర్కొన్నారు.

మేము భార‌త్‌కే అండగా ఉంటాం: అమెరికా

వాషింగ్టన్‌, జూలై 6: భారత్‌-చైనా సంక్షోభం విషయంలో భారత్‌కు అండగా అమెరికన్‌ మిలిటరీ కొనసాగుతుందని వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మిడోవ్స్‌ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తే ఎవరికైనా తోడుగానే ఉంటామని స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో యూఎస్‌ నేవీ రెండు విమాన వాహక యుద్ధ నౌకలను మోహరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దక్షిణ చైనా సముద్రంలో చైనానే కాకుండా ఏ ఇతర దేశమైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తే.. అలాంటి చర్యలకు తాము మద్దతు తెలిపేది లేదన్నారు.

Updated Date - 2020-07-07T13:41:57+05:30 IST