బైడెన్ బృందంలో మరో ఇండో-అమెరికన్కు కీలక బాధ్యతలు
ABN , First Publish Date - 2021-08-01T12:53:50+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన బృందంలో మరో ఇండో-అమెరికన్కు కీలక బాధ్యతలు అప్పగించారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పరిపాలన బృందంలో మరో ఇండో-అమెరికన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. అంతర్జాతీయ మత స్పేచ్ఛ సంస్థకు యూఎస్ అంబాసిడర్గా భారత సంతతి వ్యక్తి రషీద్ హుస్సేన్ను బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు వైట్హౌస్ ప్రకటించింది. అమెరికా చరిత్రలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు నామినేట్ అయిన మొదటి ముస్లిం వ్యక్తి హుస్సేన్ అని ఈ సందర్భంగా అధ్యక్ష భవనం పేర్కొంది. బైడెన్ సర్కార్ అన్ని మతాల వారి విశ్వాసాలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని వైట్హౌస్ తెలియజేసింది. కాగా, ప్రస్తుతం హుస్సేన్ అమెరికా జాతీయ భద్రతా మండలిలో భాగస్వామ్యాలు మరియు గ్లోబల్ ఎంగేజ్మెంట్ విభాగానికి డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.