స్పష్టత కరువైన టోర్నీ కొవిడ్‌ ప్రొటోకాల్‌

ABN , First Publish Date - 2020-08-09T09:11:16+05:30 IST

కరోనా నేపథ్యంలో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సందర్భంగా పాటించాల్సిన విధివిధానాలను యూఎస్‌ టెన్నిస్‌ సంఘం (యూఎ్‌సటీఏ) విడుదల

స్పష్టత కరువైన టోర్నీ కొవిడ్‌ ప్రొటోకాల్‌

వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సందర్భంగా పాటించాల్సిన విధివిధానాలను యూఎస్‌ టెన్నిస్‌ సంఘం (యూఎ్‌సటీఏ) విడుదల చేసింది. ఎవరైనా ఆటగాడికి కరోనా పాజిటివ్‌ అని తేలితే.. అతడిని టోర్నీ నుంచి తప్పిస్తామని తెలిపింది. కానీ, ఒకేసారి ఎక్కువ మంది ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడితే టోర్నీని రద్దు చేస్తారా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా పూర్తిగా బయో సెక్యూర్‌ వాతావరణంలో ఈ గ్రాండ్‌స్లామ్‌ను నిర్వహించనున్నారు. ‘ఆటగాళ్లకు క్రమం తప్పకుండా టెస్ట్‌లు చేస్తాం. ఎవరైనా బయటకు వెళ్లాలంటే అనుమతులు తప్పనిసరి. వీటిని ఉల్లంఘిస్తే వారిపై వేటుతోపాటు జరిమానా విధిస్తాం’ అని అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-08-09T09:11:16+05:30 IST