డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అగ్ర‌రాజ్యం !

ABN , First Publish Date - 2020-07-09T14:10:54+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితికి అమెరికా అధికారికంగా తెలియజేసింది.

డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన అగ్ర‌రాజ్యం !

వాషింగ్టన్‌/బీజింగ్‌, జూలై 8: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితికి అమెరికా అధికారికంగా తెలియజేసింది. వైదొలిగే ప్రక్రియ 2021 జూలై 6 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. కరోనా మహమ్మారిని దాచిపెట్టిన చైనాకు అండగా నిలిచిందన్న ఆరోపణలతో డబ్ల్యూహెచ్‌వోకు నిధుల విడుదలను ట్రంప్‌ సర్కారు ఏప్రిల్‌ నెలలోనే నిలిపివేసింది. అనంతరం తాము సూచించిన సంస్కరణలను అమలు చేయనందుకు నిరసనగా డబ్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతున్న ట్లు మే నెలలో ప్రకటించింది. చైనా కనుసన్నల్లో డబ్ల్యూహెచ్‌వో పని చేస్తోందని, ఆ సంస్థపై చైనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిందని ట్రంప్‌ ఆరోపించారు. 

Updated Date - 2020-07-09T14:10:54+05:30 IST