చైనా అధికారులపై ఆంక్షలు విధించిన యూఎస్
ABN , First Publish Date - 2020-07-10T13:10:36+05:30 IST
చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్ఘర్లు, కజఖ్లు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందుకు ముగ్గురు అధికారులపై ఆంక్షలు విధించామని అమెరికా తెలిపింది.
వాషింగ్టన్, జూలై 9: చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్ఘర్లు, కజఖ్లు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినందుకు ముగ్గురు అధికారులపై ఆంక్షలు విధించామని అమెరికా తెలిపింది. షిన్జియాంగ్ ఉయ్ఘర్ స్వతంత్ర ప్రాంతానికి చెందిన సీసీపీ పార్టీ కార్యదర్శి చెన్ క్వాంగువో, షిన్జియాంగ్ రాజకీయ, చట్టబద్ధ కమిటీకి చెందిన పార్టీ కార్యదర్శి ఝూ హైలున్, షిన్జియాంగ్ ప్రజా భద్రతా బ్యూరో పార్టీ కార్యదర్శి వాంగ్ మింగ్షన్లపై ఆంక్షలు విధించామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.