ఆ నిర్ణయంపై India పునరాలోచిస్తుందని ఆశిస్తున్నాం: America

ABN , First Publish Date - 2022-05-17T18:58:18+05:30 IST

గోధుమ ఎగుమతులపై విధించిన నిషేధంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. దేశదేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను నియంత్రించే ఉద్దేశంతో గోధుమ ఎగుమతులపై నిషేధం..

ఆ నిర్ణయంపై India పునరాలోచిస్తుందని ఆశిస్తున్నాం: America

వాషింగ్టన్: గోధుమ ఎగుమతులపై విధించిన నిషేధంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. దేశదేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లను నియంత్రించే ఉద్దేశంతో గోధుమ ఎగుమతులపై నిషేధం విధిస్తూ గత వారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల తమ దేశంలో గోధుమ కొరత ఏర్పడుతుందని, ఈ నిర్ణయంపై భారత్ పునరాలోచిస్తుందని ఆశిస్తున్నట్లు న్యూయార్క్‌లోని గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పేర్కొన్నారు.


‘‘భారత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను చూశాం. ఎగుమతులను పరిమితం చేయొద్దు. ఏ దేశానికైనా మేము ఇదే విషయం చెప్తాం. ఎగుమతులపై ఏవైనా పరిమితులు ఉంటే అవి ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తాయని మేము భావిస్తున్నాము. అయినా భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాలు లేవనెత్తుతున్న ఆందోళనలను బహుశా భారత్ వినే ఉంటుంది. ఈ నిర్ణయంపై పునరాలోచిస్తారని ఆశిస్తున్నాం’’ అని లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు.

Updated Date - 2022-05-17T18:58:18+05:30 IST